ప్రకాశం జిల్లా మహిళ హత్య కేసులో మలుపు..!
TeluguStop.com
ప్రకాశం జిల్లాలో సంచలనంగా మారిన మహిళ రాధ హత్య కేసు మలుపులు తిరుగుతోంది.
కేసుపై విచారణ ముమ్మరం చేసిన పోలీసులు కేతిరెడ్డి కాశిరెడ్డిని నిందితుడిగా భావిస్తున్నారని తెలుస్తోంది.
అప్పు తిరిగి చెల్లిస్తానంటూ రాధను కేతిరెడ్డి కాశిరెడ్డి మెసేజ్ పెట్టాడని మృతురాలి తండ్రి పోలీసులకు తెలిపారు.
కాగా కాశిరెడ్డి మొత్తం ఐదుగురి వద్ద రూ.2.
50 కోట్లు అప్పు చేశాడని పోలీసులు చెప్పారు.ఇటీవలే నలుగురికి ఐపీ నోటీసులు పంపిన కాశిరెడ్డి రాధకు మాత్రం ఎటువంటి నోటీస్ పంపలేదని తెలుస్తోంది.
ప్రస్తుతం కాశిరెడ్డి పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.ఈ క్రమంలో కాశిరెడ్డి కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు.