భోపాల్ MANIT యూనివర్సిటీ ప్రాంగణంలో పులి సంచారం

భోపాల్ MANIT యూనివర్సిటీ ప్రాంగణంలో పులి కలకలం రేపింది.వర్సిటీ స్పోర్ట్స్ గ్రౌండ్ వెనుక ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో సంచరిస్తుంది.

దీంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు యూనివర్సిటీకి చేరుకున్నారు.

అనంతరం స్పోర్ట్స్ గ్రౌండ్ పరిసరాల్లో పెద్దపులి పాదముద్రలను గుర్తించారు.ఈ నేపథ్యంలో ప్రొఫెసర్లు, విద్యార్థులతో పాటు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలంటూ యూనివర్సిటీ సర్క్యులర్ జారీ చేశారు.

క్యాంపస్ లో ఉన్న ప్రతి ఒక్కరి భద్రత కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు.

విద్యార్థులు ఎవరూ హాస్టల్ విడిచి బయటకు రావద్దంటూ హెచ్చరించారు.తదుపరి నోటీసు వచ్చే వరకు అన్ని తరగతుల్లో విద్యా బోధన నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

మరోవైపు పులి కోసం బోఫాల్ అటవీ శాఖ అధికారులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.

ఇంట్లో చల్లగా ఉండాలంటే ఏసీలు, కూలర్ల అక్కర్లేదు.. జస్ట్ ఇలా చేసేయండి..!