తన తండ్రి జ్ఞాపకార్థం తనయుడి అన్నదానం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన గంట సాయగౌడ్ జ్ఞాపకార్థం ఆయన కుమారుడు తన తండ్రి 14 వ సంవత్సరీకం సందర్భంగా శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ కమిటీ వైస్ చైర్మన్ గంట వెంకటేష్ గౌడ్ ఎల్లారెడ్డిపేటలో గల డే కేర్ సెంటర్ లో వృద్దులకు సాయ గౌడ్ కుమారుడు కోడలు వెంకటేష్ గౌడ్,రేణుక లు శుక్రవారం అన్నదానం చేశారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తన తండ్రి పేరు మీద అన్నదానం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.

వృద్ధులతో కలిసి సహాపంక్తి భోజనాలు చేసి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమం లో బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు వరదవెల్లి స్వామి గౌడ్,వరదవెళ్లి రచన్ గౌడ్ , ఎల్లారెడ్డి పేట తాజా మాజీ ఉప సర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్,ఎల్లారెడ్డిపేట గౌడ సంఘం పట్టణ అధ్యక్షుడు నాగుల ప్రదీప్ గౌడ్,ఫోటోగ్రాఫర్ సంఘం అధ్యక్షుడు అజ్జూ,పాత్రికేయ బృందం ఒగ్గు మహేష్ యాదవ్,పంజా సంపత్ కుమార్, కట్టెల సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మన సీనియర్ హీరోలు ఎప్పుడు అవే సినిమాలా బోరు కొట్టడం లేదా..?