కరోనా లాక్ డౌన్ సమయంలో ఎక్కువ మంది పబ్ జీ యాప్కు బాగా అలవాటు పడ్డారు.
అది బ్యాన్ అయినా అలాంటి తరహాలో వచ్చిన కొన్ని యాప్స్ భారతీయ గేమింగ్ ప్రియులను బాగా అలరించాయి.
కొరియన్ గేమ్ పబ్లిషర్ క్రాఫ్టన్ నుండి పబ్ జీ మొబైల్ యొక్క రీబ్రాండెడ్ వెర్షన్ బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (బీజీఎంఐ), ప్రభుత్వ ఆదేశాన్ని అనుసరించి భారతదేశంలోని యాపిల్, గూగుల్ యాప్ స్టోర్ల నుండి తొలగించబడింది.
పబ్ జీ వంటి ఆన్లైన్ గేమ్లు ఆడకుండా ఆపివేసినందుకు 16 ఏళ్ల బాలుడు తన తల్లిని కాల్చిచంపాడని ఆరోపించిన ఒక నెల తర్వాత ఈ అప్డేట్ వచ్చింది.
కొత్త అవతార్తో కనిపించినప్పటికీ అదే కార్యాచరణతో నిషేధించబడిన కొన్ని యాప్లను హోం మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోందని ప్రభుత్వం చెబుతున్న పార్లమెంటులో జరుగుతున్న సమావేశంలో కూడా ఈ సమస్య లేవనెత్తబడింది.
గత వారం, రాజ్యసభ ఎంపీ వి.విజయసాయి రెడ్డి పబ్జీ వంటి యాప్లపై ఐటీ మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటుందా అని అడిగారు.
దీనికి, ఎలక్ట్రానిక్స్ & ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందిస్తూ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలో వివిధ నివేదికలు, ఫిర్యాదులు అందాయన్నారు.
బ్లాక్ చేయబడిన యాప్లు ఒకే విధమైన అర్ధం వచ్చేలా కొత్త రూపంలో మళ్లీ పుట్టుకొస్తున్నాయని చెప్పారు.
ఒక పిల్లవాడు ఆడుకుంటున్న పబ్జీ ఆధారంగా తన తల్లిని చంపినట్లు మీడియాలో కథనం వచ్చిందన్నారు.
కానీ, పబ్ జీ గేమింగ్ యాప్ను 2020 సంవత్సరంలో బ్లాక్ చేసినట్లు చెప్పారు.
అప్పటి నుండి పబ్ జీ గేమ్ భారతదేశంలో అందుబాటులో లేదన్నారు.ఇదిలా ఉండగా క్రాఫ్టన్కు సమాచారం అందించిన తర్వాత భారతదేశంలోని ప్లే స్టోర్ నుండి గేమ్ను తీసివేసినట్లు గూగుల్ ధృవీకరించింది.
భారతదేశంలోని ప్లే స్టోర్లో అందుబాటులో ఉన్న యాప్కి యాక్సెస్ను బ్లాక్ చేసామని గూగుల్ ప్రతినిధి తెలిపారు.
దీంతో గేమింగ్ ప్రియులు నిరుత్సాహ పడ్డారు.
విజయాలు సాధించడం మాత్రమే సక్సెస్ కాదు.. సమంత షాకింగ్ కామెంట్స్ వైరల్!