నల్లగొండ జిల్లా:జిల్లాలోని మిర్యాలగూడ సమీపంలో కృష్ణాపురం( Krishnapuram ) వద్ద హైదరాబాద్ నుండి నెల్లూరు వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సులో అకస్మాత్తుగా మంటలు వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైన సంఘటన గురువారం అర్థరాత్రి చోటుచేసుకుంది.
ప్రమాద సమయంలో బస్సులో 26 మంది ప్రయాణికులు ఉండగా వారు అప్రమత్తతతో బస్సు నుండి బయటికి రావడంతో ప్రాణ నష్టం తప్పింది.
అగ్ని ప్రమాదానికి గురైన బస్సు కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందినదుగా గుర్తించారు.
బస్సు వెనుక టైర్ పేలడంతో ప్రమాదం జరిగినట్టుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
చెన్నైలో విదేశీ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ దారుణం.. ‘అది చీరేస్తా’ అంటూ అసభ్య బెదిరింపులు!