రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామ శివార్లో అదుపుతప్పి బైకు చెట్టుకు ఢీకొనడంతో యువకుడు మృతి చెందిన సంఘటన గంభీరావుపేట మండలం నర్మాల గ్రామ శివారులో చొటు చేసుకుంది.

పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేట గ్రామానికి చెందిన బరిగి రాజశేఖర్(25) వృత్తిరీత్యా మేస్త్రి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు.

మృతునికి భార్య లాస్య, కూతురు ఉన్నారు.కామారెడ్డి జిల్లా మాచారెడ్డి నుండి దుబ్బాక వైపు వస్తుండగా ఆదివారం రాత్రి సమయంలో నర్మాల గ్రామ శివారులోని మూలమలుపు వద్ద అదుపుతప్పి చెట్టుకు ఢీకొని రోడ్డు పక్కన తలకు గాయాలయి చనిపోయి ఉన్నాడని, మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ మహేష్ తెలిపారు.

ప్రభాస్ ను టార్గెట్ చేస్తున్న బాలీవుడ్ హీరోలు…కారణం ఏంటి..?