బీహార్‎లో కొలువుదీరిన కొత్త ప్ర‌భుత్వం

బీహార్ లో కొత్త ప్ర‌భుత్వం కొలువుదీరింది.జేడీయూ అధినేత‌ నితీశ్ కుమార్ కొత్త ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు.

డిప్యూటీ సీఎంగా ఆర్జేడీ కీల‌క నేత తేజ‌స్వీ యాద‌వ్ ప్ర‌మాణం చేశారు.సీఎంగా ప‌ద‌వీ ప్ర‌మాణం చేయ‌డం ఎనిమిదోసారి కాగా, డిప్యూటీ సీఎంగా తేజ‌స్వీ రెండోసారి.

గతంలో నితీశ్ కేబినెట్ లోనే డిప్యూటీ సీఎంగా కొన‌సాగిన తేజ‌స్వీ.జేడీయూతో విభేదాల కార‌ణంగా కొన్నాళ్ల‌కే రాజీనామా చేశారు.

బీహార్ సీఎంగా కొన‌సాగిన నితీశ్ ఇటీవ‌లే బీజేపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు.గవర్నర్ ఫాగు చౌహాన్‌కు రాజీనామాను సమర్పించిన నితీశ్.

మ‌ద్ద‌తుగా నిలిచిన‌ 164 మంది ఎమ్మెల్యేల జాబితాను కూడా అందజేశారు.బీహార్‌లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమకు 7 పార్టీలు మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు.