'కారు' గుర్తుతోనే పోటి

నల్లగొండ జిల్లా:మునుగోడు ఉపఎన్నికలో'కారు' గుర్తుతోనే పోటి చేస్తున్నట్లు టీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు.దిల్లీలో సీఈసీని కలిసిన ఆ పార్టీ నేతలు తెలంగాణ రాష్ట్ర సమితి,భారత్​ రాష్ట్ర సమితిగా గుర్తింపు పొందడానికి కొంత సమయం పడుతుందని వివరించారు.

అందుకే మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ పేరుతోనే ప్రచారంలోకి వెళ్తున్నట్లు ప్రకటించారు.రేపటి నుంచే మునుగోడులో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించనున్నట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు.

వ్యక్తి పేరు మార్చినట్లే పార్టీ పేరు మార్చామని,మిగతావన్నీ యథాతథంగా ఉంటాయని వారు స్పష్టం చేశారు.

కల్కి పై మోహన్ బాబు రివ్యూ…భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!