అక్రమంగా గంజాయి సేవిస్తూ,తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

120 గ్రాముల గంజాయి ,ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గంజాయి సేవిస్తున్న వ్యక్తిని నమ్మదగిన సమాచారం మేరకు అదుపులోకి తీసుకొని రిమాండ్ కి తరలించారు.

ఈ సందర్భంగా టౌన్ సి ఐ ఉపేందర్( Town C I Upender ) మాట్లాడుతూ రెడ్డి మల్ల నవీన్ S/o శ్రీనివాస్ అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా గంజాయి తాగడానికి అలవాటు పడి గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర గంజాయి కొనుగోలు చేసి తాగుతూ, తాగే వారికి అమ్ముతుండగా శనివారం రోజున రాత్రి సిరిసిల్ల పట్టణంలోని కాలేజ్ గ్రౌండ్ లో తగుతుండగా నమ్మదగిన సమాచారం మేరకు నవీన్ అదుపులోకి తీసుకొని 120 గ్రాముల గంజాయి, ఒక ద్విచక్ర వాహనం సీజ్ చేసి ఈ రోజు రిమాండ్ కి తరలించడం జరిగింది అని టౌన్ సి.

ఐ ఉపేందర్ తెలిపారు.యువతకు పోలీస్ వారి విజ్ఞప్తి, గంజాయి లాంటి మత్తు పదార్థాలను సరఫరా చెయ్యడం, తాగడం చట్ట రీత్యా నేరం, గంజాయి సంబంధిత సమాచారం ఉంటే సంబంధిత పోలీస్ వారికి లేదా డయల్ 100 కి సమాచారం అందించాలని కోరారు.

సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడుతాయి అని తెలిపారు.

ఆగస్ట్ 9న థియేటర్స్ లో “సంఘర్షణ”