Minister Dharmana Prasada Rao : నాయకుడు తప్పు చేయకూడదు..: మంత్రి ధర్మాన
TeluguStop.com
వైసీపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు( Minister Dharmana Prasada Rao ) కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రజాప్రతినిధులు అవినీతికి దూరంగా ఉండాలని సూచించారు.నాయకుడు( Leader ) తప్పు చేయకూడదన్న ఆయన ఎవరినీ చేయనివ్వకూడదని పేర్కొన్నారు.
శ్రీకాకుళానికి( Srikakulam ) తాను చేసిన అభివృద్ధి ఎవరూ చేయలేదని తెలిపారు.శ్రీకాకుళంలో వనరులు ఉన్నాయనే పక్క జిల్లాల నుంచి వచ్చేస్తున్నారని మండిపడ్డారు.
"""/" /
ఇలా వదిలేస్తే రౌడీలమయం అయిపోతుందని వెల్లడించారు.మిగతా ప్రాంతాలు ఇలానే పాడై పోతున్నాయని తెలిపారు.
దశాబ్దాలుగా శ్రీకాకుళం ప్రశాంతంగా ఉండాలనే చూస్తున్నానని పేర్కొన్నారు.జిల్లాలో ఎక్కడైనా గెలుస్తానన్న ఆయన శ్రీకాకుళంలో వేరే వారు గెలవరన్నారు.
మిగతా వారు కనీసం అభివృద్ధి కూడా చేయలేరని తెలిపారు.