సాగర్ వరద కాలువకు మారేపల్లి వద్ద భారీ గండి…!

నల్లగొండ జిల్లా:నాగార్జునసాగర్ వరద కాలువకు సోమవారం రాత్రి నల్లగొండ జిల్లా అనుముల మండలం మారేపల్లి వద్ద భారీ గండి పడింది.

ఈనెల 2న నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వరద కాలువకు నేటిని విడుదల చేశారు.

కాగా కాలువ మరమ్మత్తులు లేకపోవడంతో పాటు అస్తవ్యస్తంగా ఉండడంవల్ల నీటిని విడుదల చేసిన మూడు రోజులకే కాలువకు గండి పడిందని రైతులు పేర్కొంటున్నారు.

ఈ కాలువ ద్వారా 200 చెరువులకు నీరు చేరనుందని,సుమారు 250 గ్రామాలకు త్రాగునీటి సౌకర్యం అందే అవకాశాలు ఉన్నాయి.

ఈ వరద కాలువకు 36 డిస్ట్రిబ్యూటరీ కాలువలు ఉన్నాయి.కాలువల్లో బండరాళ్లు,కంపచెట్లు తొలగించకపోవడం వలన గండి పడిందని రైతులు అంటున్నారు.

కాగా ఏఎమ్మార్పి జేఈ గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించారు.రెండు మూడు రోజుల్లో మరమ్మతులు చేపట్టి నీటిని విడుదల చేస్తామని, రైతులు ఆందోళన చెందొద్దని తెలిపారు.

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా నోబెల్ గ్రహిత మహ్మద్ యూనస్..