కొలువు కొట్టిన యువకునికి ఘనంగా సన్మానం

రాజన్న సిరిసిల్ల జిల్లా : పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో -అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్( Assistant Executive Engineer Job ) గా ప్రభుత్వ ఉద్యోగం పొందిన రాపెల్లి చేతన్( Rapelli Chetan ) కు ఘనంగా సన్మానం చేసిన పద్మశాలి సేవా సంఘం సభ్యులు.

ఎల్లారెడ్డిపేట( Yellareddypet ) మండల కేంద్రానికి చెందిన అంబదాస్ హరిత దంపతుల కుమారుడు ఏ ఈగ ప్రభుత్వ ఉద్యోగమును పొందగా గురువారం పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీ మార్కండేయ ఆలయంలో రాపెల్లి చేతన్ తండ్రి ఆంబదాస్ లను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ తమ సామాజిక వర్గం నుండి చేతన్ ప్రభుత్వ ఉద్యోగం పొందడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

తను ఉద్యోగరీత్యా ఉన్నత స్థానాలను చేరుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు రాపల్లి దేవంతం, వనం రమేష్, గౌరీ శంకర్, గోశిక దేవదాస్, గాజుల దేవదాస్, శ్రీరాం సుదర్శన్, జిల్లా ఉపాధ్యక్షుడు పోతు ఆంజనేయులు, మరియు యువజన విభాగం సుంకి భాస్కర్, దోమల భాస్కర్, సుంకి విష్ణు, దొంత మనోహర్, వినోద్, శ్రీకాంత్, సిద్దిరాములు, నర్సింలు, బాలకిషన్, తదితరులు పెద్దలు సంఘసభ్యులు పాల్గొన్నారు.

ఈ సినిమా టైటిల్స్ అర్థాలేంటో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు..?