పొలంలో వరి కొయ్యలకు నిప్పు పెట్టి రైతు మృతి…!

సూర్యాపేట జిల్లా:పొలంలో వరి కొయ్యలకు నిప్పుపెట్టగా భారీ మొత్తంలో పొగ కమ్ముకోవడంతో ఊపిరాడక సూర్యాపేట జిల్లా( Suryapet District ) మునగాల మండలంనేలమర్రి గ్రామానికి చెందినచామకూరి సూర్యనారాయణ(68)( Suryanarayana ) అనే రైతు అక్కడిక్కడే మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు చామకూరి సూర్యనారాయణ మంగళవారం తన పొలంలో వరి కోయ్యలకు నిప్పు పెట్టారు.

మంటలు పక్క పొలాలకు వ్యాపించడంతో కంగారుపడి మంటలను ఆర్పే ప్రయత్నంలో దట్టమైన పొగ వ్యాపించి ఊపిరాడక పొలంలోనే పడిపోయి మృతి చెందాడు.

సాయంత్రం వరకూ ఇంటికి రాకపోవడంతో మృతుని కుమారుడు కాశీపతి పొలం వద్దకు వెళ్ళి చూడగా పొలంలో శవమై కనిపించాడు.

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకుమునగాల పోలీసులుPolice ) కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

అగ్ని ప్రమాదంలో పవన్ చిన్న కొడుకు… స్పందించిన మెగాస్టార్ చిరంజీవి!