శ్రీధర్ రెడ్డి హత్యపై సమగ్ర విచారణ జరపాలి..: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్( RS Praveen Kumar ) కీలక వ్యాఖ్యలు చేశారు.

శ్రీధర్ రెడ్డి ( Sridhar Reddy ) హత్యపై సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర డీజీపీని కోరినట్లు తెలిపారు.

హత్య జరిగి నాలుగు రోజులు అవుతున్నా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.

ఈ క్రమంలోనే మంత్రి జూపల్లి కృష్ణారావుపై( Minister Jupalli Krishnarao ) ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని చెప్పారు.ఈ నేపథ్యంలో కేసును ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కోరామని తెలిపారు.

వారం రోజుల్లో న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.