ఏపీ పోలీసులపై తెలంగాణలో కేసు నమోదు

నల్లగొండ జిల్లా:తెలంగాణ భూభాగంలోకి 500 మంది సాయుధ బలగాలతో ఏపి పోలీసులు డ్యాం పైకి దౌర్జన్యంగా వచ్చి డ్యాంలో 13 గేట్లు ధ్వంసం చేశారని తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ ఫోర్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాగార్జున విజయపురి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.

కృష్ణా బోర్డు నిబంధనలకు విరుద్ధంగా కుడి కాలువ ద్వారా ఏపీకి నీరు వదిలారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఏపీ పోలీసులపై సెక్షన్ 447, 427 కింద కేసు నమోదు చేసినట్లు విజయపురి పోలీసులు తెలిపారు.

వివాదానికి చెక్ పెట్టిన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్.. ఫోన్ కాల్ కోసం ఎదురుచూస్తానంటూ?