ఈవీఎం ధ్వంసం ఘటనలో ఎమ్మెల్యే పిన్నెల్లిపై కేసు నమోదు

మాచర్ల( Macherla)లో ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో ఎమ్మెల్యే పిన్నెల్లిపై కేసు నమోదైంది.

ఈ మేరకు ఆయనపై ఐపీసీ 143, 147, 448, 427, 353, 453, 452, 120(బి), ఆర్పీ యాక్ట్ 131, 135 కింద కేసులు నమోదు అయ్యాయి.

అయితే ఈ ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం( Central Election Commission) తీవ్రంగా మండిపడిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని కీలక ఆదేశాలు జారీ చేసింది.

అదేవిధంగా కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని సీఈసీ ఆదేశాలు ఇచ్చింది.

ఈ క్రమంలోనే సీఈవో మాట్లాడుతూ పిన్నెల్లి( Pinnelli Ramakrishna Reddy ) అరెస్ట్ కోసం పోలీస్ బృందాలు గాలిస్తున్నాయని చెప్పారు.

ఈవీఎం ధ్వంసం అయినప్పటికీ డేటా సేఫ్ గానే ఉందని తెలిపారు.కాగా పాల్వాయి గేట్ దగ్గర ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే.

వీడియో వైరల్: పాఠశాలలో పాడుపనులు..