షాకింగ్ వీడియో: కనురెప్ప పాటులో తల్లిబిడ్డలను పొట్టన పెట్టుకున్న కారు..

ప్రతినిత్యం ప్రపంచవ్యాప్తంగా పదుల సంఖ్యలో యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి.ఈ ఘటనలో అనేకమంది ప్రాణాలు కోల్పోతూ ఉండగా చాలామంది అంగవైకల్యంగా మారిపోతున్నారు.

అయితే ఈ యాక్సిడెంట్ లకు సంబంధించి సీసీటీవీ ఫోటేజీలలో రికార్డయిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ (Viral On Social Media_అవుతుండడం మనం చూస్తూనే ఉంటాము.

తాజాగా ఇలాంటి సంఘటన సంబంధించిన మరో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ ఘటనలో తల్లి కూతుర్లతోపాటు మరో బాలిక కూడా ప్రాణాలు కోల్పోయారు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.

ఉత్తరాఖండ్(Uttarakhand) రాష్ట్రంలో ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది.రోడ్డుపై అటుగా వెళ్తున్న ఒక కారు ముగ్గురిని బలి తీసుకుంది.

ఈ ఘోర రోడ్డు ప్రమాదం సంబంధించిన భయానక వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని న్యూ టెహ్రీ(New Tehri ,Uttarakhand State) ప్రాంతంలో సోమవారం నాడు ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది.

కేవలం 7 సెకన్లు ఉన్న ఈ వీడియోలో కారు ఎంత బీభత్సాన్ని సృష్టించిందో క్లియర్ గా కనబడుతుంది.

"""/" / రోడ్డుకు చివరగా ఓ వీధిలో ఒక మహిళ ఇద్దరు అమ్మాయిలు నడుస్తున్నట్లుగా వీడియోలో కనబడుతుంది.

అలా వారు వెళుతున్న సమయంలో వారికి ఎదురుగా అతివేగంగా వచ్చి వీధిలో నడుస్తున్న వారిపై దూసుకెళ్లింది.

దాంతో ఒక్కసారిగా వారందరూ అమాంత దూరం గాలిలో ఎగిరిపడ్డారు.ఈ దిబ్రాంతికరమైన ఘటనలో ఓ మహిళ ఇద్దరు పిల్లలు మరణించారు.

ఇలాంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో రోడ్లపై నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది.

మౌనంగా ఉన్నానంటే తప్పు చేసినట్లు కాదు.. జయం రవి భార్య కామెంట్స్ వైరల్!