పాకిస్తాన్ లో అగ్నికి అహుతైన బస్సు.. 21 మంది సజీవ దహనం

పాకిస్తాన్‌ లో విషాద ఘటన జరిగింది.ఓ బస్సులో మంటలు చెలరేగడంతో.

21 మంది సజీవ దహనమయ్యారు.మరికొందరికి గాయాలయ్యాయి.

బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.సింధ్ ప్రావిన్స్‌లోని జంషోరో జిల్లా నూరియాబాద్ సమీపంలో M9 మోటార్ వేపై అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని స్థానిక అధికారులు అంచనా వేస్తున్నారు.కాగా మృతులంతా వరద బాధితులని.

కరాచీ నుంచి తమ స్వగ్రామానికి వెళ్తుండగా ఘటన జరిగిందని వెల్లడించారు.

సుప్రీంలో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా.. ఎమ్మెల్సీ దండె విఠల్