ఇజ్రాయెల్ సైనికుల కాల్పుల్లో 17 ఏళ్ల పాలస్తీనియన్-అమెరికన్ మృతి…

ఇజ్రాయెల్, హమాస్ గ్రూపు మధ్య చాలా కాలంగా యుద్ధం జరుగుతోంది దీనివల్ల ఇరువైపులా రక్తపుటేరులు పారుతున్నాయి.

ఏ పాపం చేయని చిన్నపిల్లలు, టీనేజ్ వయసు వాళ్ళు కూడా వీరి శత్రుత్వం వల్ల అన్యాయంగా బలైపోతున్నారు.

తాజాగా అమెరికా, పాలస్తీనా పౌరసత్వం కలిగిన ఓ యువకుడిని ఇజ్రాయెల్ సైనికులు కాల్చేసి చంపేశారు.

అతని వయస్సు కేవలం 17 సంవత్సరాలు, అతని పేరు తౌఫిక్ హిజాజీ.ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య వివాదాస్పద ప్రాంతమైన వెస్ట్ బ్యాంక్‌లో సైనికులపై పాలస్తీనియన్ల రాళ్లు విసిరారు.

ఆ సమయంలో తౌఫిక్ హిజాజీ( Tawfik Hijazi ) కూడా అక్కడే ఉండి రాళ్లు విసరుతున్నాడు.

సైనికులు కాల్పులు జరపగా బుల్లెట్ తగిలి అక్కడికక్కడే చనిపోయాడు.పాలస్తీనా ఆరోగ్య అధికారులు, అతని మామ శుక్రవారం తౌఫిక్ మరణించినట్లు ప్రకటించారు.

దీనిపై ఇజ్రాయెల్ సైన్యం ఏమీ కామెంట్స్ చేయలేదు. """/" / అతని మరణం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది, చాలా మంది విచారణ కోసం కోరారు.

అసలు ఏం జరిగిందో, ఎందుకు చంపారో తెలియాల్సి ఉంది.ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య వివాదాన్ని ముగించడానికి శాంతియుత మార్గాన్ని కనుగొనడం ఎంత ముఖ్యమో అతని మరణం కూడా చూపించింది.

ఆయన మృతి పట్ల తాము చాలా ఆందోళన చెందుతున్నామని అమెరికా ప్రభుత్వం తెలిపింది.

ఏం జరిగిందనే దానిపై మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వారు తెలిపారు.ఈ విషయాన్ని వైట్‌హౌస్ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ( John Kirby ) తెలిపారు.

"""/" / యుద్ధం తర్వాత పాలస్తీనా ప్రత్యేక దేశంగా మారడం తనకు ఇష్టం లేదని ఇజ్రాయెల్ అధినేత బెంజమిన్ నెతన్యాహు అమెరికాకు తెలిపారు.

దీంతో వివాదం పరిష్కరించడం కష్టతరంగా మారింది.ఇజ్రాయెల్ లేదా హమాస్ ఏ విషయంలోనూ ఏకీభవించడానికి ఇష్టపడలేదు.

Blackjack Variants & All Blacks Betting: A Practical Guide For NZ Punters