అన్నపూర్ణ స్వచ్చంధ సేవ సంస్థ ఆద్వర్యంలో 69వ రోజు అన్నదాన కార్యక్రమం

రాజన్న సిరిసిల్ల జిల్లా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయ ఆవరణలో నిత్యం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా 69వ రోజు సందర్భంగా ఇప్పపుల గణేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని కుటుంబ సభ్యులు,గౌరిసెట్టి కుమారస్వామి 11వ నెల తిథి సందర్భంగా కుటుంబ సభ్యుల సహాయంతో శాశ్వత దాతలు నాగుబోతు రవీందర్ జ్యోతి(భాను ఏజెన్సీస్) మరియు సంవత్సర దాతలు తోట లక్ష్మి, పబ్బ విశాల పూర్ణిమ, కూరగాయల శన్ష్రాయ్ మౌర్య, కొండ కనుకయ్య కళావతి ల సహకారాలతో ఈ రోజు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ పార్కింగ్ స్థలంలో 60మంది అన్నర్థులకు పేదలకు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ట్రస్ట్ సభ్యులు కూరగాయల మధు అన్నారు.

అనంతరం వారు మాట్లాడుతూ నిత్యం నిర్వహించే అన్నదాన కార్యక్రమాన్ని ఇంకా అభివృద్ధి చేయుటకు గాను ఇతర సేవ కార్యక్రమాలకు గాను మీ వంతు సహాయ సహకారాలు అందించాలనుకునేవారు ట్రస్టు నెంబర్ 8919376459,ను సంప్రదించాల్సిoదిగా కోరారు.

ఇట్టి సేవ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు ఇప్పపుల గణేష్, తోట శ్రీకాంత్, అద్దంకి నరేష్, బల్గురి అఖిల్, తదితరులు పాల్గొన్నారు.

గేమ్ ఛేంజర్ అప్డేట్ ఇవ్వాలంటూ చరణ్ రైమ్ ను అడిగిన నెటిజన్… కౌంటర్ ఇచ్చిన ఉపాసన!