శ్రీ కృష్ణుడు ద్వాపర యుగంలో ప్రపంచానికి సన్మార్గాన్ని చూపేందుకు జన్మించాడు.శ్రీకృష్ణుడు గీతలో చాలా విషయాలు ప్రస్తావించాడు.
గీత హిందూ ధర్మానికి చెందిన అత్యంత పవిత్ర గ్రంథంగా పరిగణించబడుతుంది.మహాభారత యుద్ధంలో శ్రీ కృష్ణుడు అర్జునుడికి చెప్పిన విషయాలన్నీ అందులో వివరంగా ప్రస్తావనకు వచ్చాయి.
శ్రీమద్ భగవద్గీతలో శ్రీకృష్ణుని ప్రసంగ పాఠం ఉంది.ఇందులో శ్రీ కృష్ణుడు మనిషి జీవితానికి సంబంధించిన పలు విషయాలను ప్రస్తావించాడు.
శ్రీ కృష్ణుడు గీతలో 5 విషయాలను జీవితానికి మూల మంత్రం అనే విధంగా చూపించాడు.
ఈ 5 విషయాలను అనుసరించడం ద్వారా మనిషి తన జీవితంలో చాలా ముందుకు సాగవచ్చు.
ఈ 5 విషయాలు జీవితానికి కీలకంగా నిలుస్తాయి.ఈ విషయాలు తెలుసుకోవడం ద్వారా మనిషి జీవితానికి గల నిర్వచనాన్ని తెలుసుకోవచ్చు.
శ్రీ కృష్ణుడు గీతలో ఏయే విషయాలను ప్రస్తావించాడో ఇప్పుడు తెలుసుకుందాం.1.
కష్ట సమయాల్లోనూ ప్రేమను వదిలివేయవద్దు
ఎదుటి వ్యక్తికి కష్టకాలం దాపురించినప్పుడు అతని సాంగత్యాన్ని విడిచిపెట్టకూడదని శ్రీ కృష్ణుడు చెప్పాడు.
మీరు ఒక వ్యక్తిని ప్రేమిస్తే, కష్ట కాలంలోనూ అతన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అని శ్రీ కృష్ణుడు చెప్పాడు.
కష్టకాలంలో ఒక వ్యక్తిని ఎప్పుడూ పరీక్షించకూడదు.2.
వ్యక్తి తలరాత మారుతుంది
మనిషి తలరాత మళ్లీ మళ్లీ మారుతుందని శ్రీ కృష్ణుడు చెప్పాడు.
భగవంతుడిని ఎన్నిసార్లు స్మరిస్తాడో, ఒక వ్యక్తి యొక్క తలరాత, అదృష్టం అన్నిసార్లు మారుతుంది.
అందుకే భగవంతుడిని ఎప్పుడూ స్మరించుకోవాలి. """/"/
3.
ఎప్పుడూ గర్వంతో ఉండకండి
మనిషికి ఎప్పుడూ అహంకారం ఉండకూడదు.అహకారం అనేది మనిషికి గల అతి పెద్ద శత్రువు.
వ్యక్తి నాశనానికి అహంకారం కారణంగా నిలుస్తుంది.అందుకే మనిషి ఎప్పుడూ అహంకారంతో మెలగకూడదు.
ఇది మనిషి పతనానికి అతిపెద్ద కారణంగా నిలుస్తుంది.4.
మార్పు అనేది విశ్వం జనీన చట్టం
మార్పు ప్రపంచ నియమం అని శ్రీ కృష్ణుడు చెప్పాడు.
మార్పు ద్వారానే ప్రపంచానికి, వ్యక్తికి మేలు జరుగుతుంది.అందుకే గతం గురించి మనిషి ఎప్పుడూ ఆలోచించకూడదు.
ఇంతేకాకుండా గడచిపోయిన విషయాలపై మనసు పెట్టకూడదు.భవిష్యత్తు అనేది రేపు అనే దానిపై ఆధారపడి ఉంటుంది.
మార్పు నిత్యం జరుగుతూనే ఉంటుంది.మనిషి ఈ మార్పును స్వీకరిస్తూ ముందుకు సాగాలి.
"""/"/
5.మనసును నియంత్రించండి
ప్రతి వ్యక్తి తన మనస్సును నియంత్రించుకోవాలి.
మనిషికి ఉన్న గొప్ప సాధనం మనసు.దాని సహాయంతో మాత్రమే మనిషి ఏదైనా పని చేయగలడు.
అందుకే మనసును ఎప్పుడూ అదుపులో ఉంచుకోవాలి.లేకపోతే మనసు మనిషికి శత్రువులా మారుతుంది.