బాధిత కుటుంబానికి 5 వేల ఆర్థిక సహాయం

రాజన్న సిరిసిల్ల జిల్లా :తమతో చదువుకున్న పూర్వ విద్యార్థి అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందగా పూర్వ విద్యార్థులు 1994- 95 బ్యాచ్ కలిసి గురువారం ఐదువేల ఆర్థిక సహాయాన్ని( Financial Assistance ) అందజేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు.

/BR ముస్తాబాద్ మండలం( Mustabad ) ఆవునూరు గ్రామానికి చెందిన బత్తుల రాజు బలవన్మరణానికి పాల్పడడం పట్ల సమాచారం అందుకున్న తోటి మిత్రులు తమ బాల్య మిత్ర ఫౌండేషన్( Balya Mitra Foundation ) తరపున 5వేల ఆర్థిక సహాయాన్ని రాజు కుటుంబానికి అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షులు చందుపట్ల లక్ష్మారెడ్డి, రావుల ఎల్లారెడ్డి, నెవూరి రామేశ్వర్ రెడ్డి, కుంబాల తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఓవ‌ర్ వెయిట్‌తో బాధ‌ప‌డేవారికి వ‌రం అవిసె గింజలు.. ఇంత‌కీ ఎలా తీసుకుంటే బ‌రువు త‌గ్గుతారు?