3,70,000 లకు కూరగాయల తైబజార్ వేలం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రతి శుక్రవారం సోమవారం నిర్వహించే కూరగాయల సంత తై బజార్ వేలంపాటలు గురువారం గ్రామపంచాయతీ ఆవరణలో స్పెషల్ ఆఫీసర్ సత్తయ్య సమక్షంలో నిర్వహించారు.

ఈ వేలం పాటలలో తై బజార్ కాంట్రాక్టర్లు జవ్వాజీ రామస్వామి , దేశ్ పాండీ మల్లేశం లు పాల్గొన్నారు.

ఏప్రిల్ ఒకటో తేదీ 2024 నుంచి మార్చి 31 2025 వరకు తై బజార్ కూరగాయల వేలం పాటలు నిర్వహించగా 3 , 70, 000 రూపాయలకు తైబజార్ కాంట్రాక్టర్ జవ్వాజీ రామస్వామి వేలన్ని కైవసం చేసుకున్నారు.

ఈ వేలం పాటల్లో ఎంసిఓ ఓజీ హేమ పంచాయతీ సెక్రెటరీ దేవరాజు,మాజీ వార్డు సభ్యులు జవ్వాజి లింగం ,పందిల్ల శ్రీనివాస్ గౌడ్ ,గ్రామస్తులు పాల్గొన్నారు.

బాలయ్య పాదాలకు నమస్కరించి అవార్డు అందుకున్న ఐశ్వర్యరాయ్.. ఫ్యాన్స్ ఫిదా!