2022లో అత్యధికంగా ట్రోల్స్ కు గురయ్యిన టాలీవుడ్ మూవీలు ఇవే!

2022 ఏడాది మరొక వారం రోజుల్లో పూర్తి కాబోతుంది.కొత్త ఏడాదిని గ్రాండ్ గా ఆహ్వానించడం కోసం అంతా రెడీ అవుతున్నారు.

మరి ఈ ఏడాదిలో కొన్ని వందల సినిమాలు రిలీజ్ అయ్యాయి.ప్రతీ వారం కూడా కొత్త కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

అయితే ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో కొన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటే మరికొన్ని మాత్రం డిజాస్టర్స్ అయ్యాయి.

వందల కోట్ల నష్టాలను తెచ్చిపెట్టాయి.మరి ఈ ఏడాది బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ట్రోల్స్ ఎదుర్కున్న సినిమాలు కూడా ఉన్నాయి.

అవి ఏంటో తెలుసా.ఇప్పుడు ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది.

కానీ ఈ సినిమా దారుణమైన డిజాస్టర్ ఎదుర్కొంది.సోషల్ మీడియాలో ఈ సినిమాపై దారుణమైన ట్రోల్స్ వచ్చాయి.

మంచు మోహన్ బాబు నటించిన సన్నాఫ్ ఇండియా సినిమాకు కూడా ట్రోల్స్ వచ్చాయి.

ఈ సినిమా విఎఫ్ఎక్స్ మొదలుకుని అందులోని ప్రతీ సన్నివేశం గురించి నెట్టింట ట్రోల్స్ వచ్చాయి.

ఈ సినిమాకు మోహన్ బాబు కెరీర్ లోనే దారుణమైన ట్రోల్స్ వచ్చాయి. """/"/ లైగర్.

ఈ సినిమాతో కోట్లు వసూళ్లు చేసి మరో బ్లాక్ బస్టర్ గా చేస్తారు అనుకున్నారు.

ముందు నుండి ఈ సినిమా హైప్ చూసి అంతా అలానే అనుకున్నారు.అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత దారుణమైన ఫలితాన్ని మూటగట్టుకుంది.

పురీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా వచ్చిన ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది.

"""/"/ మాస్ రాజా రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాపై కూడా సోషల్ మీడియాలో భారీ విమర్శలు వచ్చాయి.

అలాగే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమాపై కూడా ట్రోల్స్ వచ్చాయి.రామ్ చరణ్, చిరు కలిసి నటించిన ఈ సినిమాకు ఇలాంటి ఫలితాన్ని ఊహించలేదు.

కొరటాల శివ మొదటిసారి ప్లాప్ ఎదుర్కొంది ఈ సినిమాతోనే.ఈ సినిమా వల్ల ఈయనపై కూడా భారీ ట్రోల్స్ వచ్చాయి.

ఇక మంచు విష్ణు నటించిన జిన్నా సినిమాపై కూడా దారుణమైన ట్రోల్స్ వచ్చాయి.

సన్నీలియోన్, పాయల్ రాజ్ పుత్ నటించిన ఈ సినిమా పెద్ద ఎత్తున విమర్శలకు గురి అయ్యింది.

పాకిస్థాన్‌లో హోటల్ రూమ్ కాస్ట్ ఎంతో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు..!