అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా 17వ బెటాలియన్ సర్దాపూర్ నందు బైక్ ర్యాలీ

రాజన్న సిరిసిల్ల జిల్లా సర్దాపూర్ 17వ బెటాలియన్ కమాండెంట్ యస్.శ్రీనివాస‌‌‌ రావు ఆదేశాల మేరకు సమాజంలో శాంతి పరిరక్షణకి అసాంఘిక శక్తులతో జరిగిన పోరాటంలో అసువులు బాసిన అమరవీరులను స్మరించుకుంటూ వారి జ్ఞాపకార్థం శనివారం బైక్ ర్యాలీ కార్యక్రమం చేపట్టడం జరిగింది.

ఈ బైక్ ర్యాలీ సర్దాపూర్ నందుగల బెటాలియన్ మెయిన్ గేటు వద్ద నుంచి ప్రారంభమై జగ్గారావు పల్లె నుండి పెద్దూరు మీదుగా సిరిసిల్ల వరకు కొనసాగింది.

"పోలీస్ అమరవీరులకు-జోహార్ జోహార్" అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగింది.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ లు ఎ.

జయప్రకాశ్ నారాయణ,యమ్.పార్థసారథి రెడ్డి ,అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

నేడు ఏపీ ఈ -క్యాబినెట్ సమావేశం.. చర్చించే అంశాలు ఇవే