థ్రిల్లింగ్ సన్నివేశాలతో ఆకట్టుకుంటున్న 1134 ట్రైలర్

కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాగా వైవిధ్యభరితమైన కథతో ప్రేక్షకుల ముందుకురాబోతోంది 1134 మూవీ.డిఫరెంట్ టైటిల్‌తో థ్రిల్లింగ్ ప్రధానంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు నూతన దర్శకుడు శరత్ చంద్ర తడిమేటి.

రాబరీ నేపథ్యంలో బలమైన కథా, కథనంతో ఈ సినిమా సాగనుందట.ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోగా.

తాజాగా చిత్ర ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై హైప్ క్రియేట్ చేశారు మేకర్స్.

2 నిమిషాల 24 సెకనుల నిడివితో ఆద్యంతం ఉత్కంఠ భరితమైన సన్నివేశాలతో ఈ ట్రైలర్ కట్ చేశారు.

ATM దొంగతనాలు చేస్తున్న ముగ్గురు వ్యక్తుల కథను ఎంతో వైవిధ్య భరితంగా మలిచారని ఈ ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది.

భారీ డైలాగ్స్ జోలికి పోకుండా కేవలం థ్రిల్లింగ్ సన్నివేశాలతోనే సినిమాపై అంచనాలు పెంచేశారు.

ట్రైలర్ చివరలో 'అన్నీ నువ్వను కునేలా జరిగితే మరి నేనెందుకురా ఇక్కడ' అంటూ వచ్చిన డైలాగ్.

ఈ సినిమాలో ఏదో కొత్త కోణం చూపించబోతున్నారని స్పష్టం చేస్తోంది.సొంతంగా తనే కథ రాసుకొని హై టెక్నికల్ వాల్యూస్‌తో అన్నివర్గాల ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యేలా ఈ సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ శరత్ చంద్ర తడిమేటి.

ప్రతి సన్నివేశం కూడా ఎంతో థ్రిల్ చేసేలా షూట్ చేశారు.మరి కొద్ది రోజుల్లో ఈ మూవీ రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌ వేగవంతం చేశారు.

"""/" / రాంధుని క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ 1134 చిత్రంలో గంగాధర్ రెడ్డి, ఫణి శర్మ, మదుపు ఫణి భార్గవ్, కృష్ణ మదుపు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

శివతేజ్ బైపల్లి, శరత్ కూతాడి సంగీతం అందిస్తున్నారు.నజీబ్ షేక్, జితేందర్ తలకంటి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు.

H3 Class=subheader-styleనటీనటులు: /h3p గంగాధర్ రెడ్డి, ఫణి శర్మ, మదుపు ఫణి భార్గవ్, కృష్ణ మడుపు.

H3 Class=subheader-styleసాంకేతిక వర్గం:/h3p డైరెక్టర్: శరత్ చంద్ర తడిమేటి బ్యానర్: రాంధుని క్రియేషన్స్ మ్యూజిక్: శివతేజ్ బైపల్లి, శరత్ కూతాడి డీఓపీ: నజీబ్ షేక్, జితేందర్ తలకంటి డీఐ: గజ్జల రక్షిత్ కుమార్ పీఆర్ఓ: సాయి సతీష్, పర్వతనేని రాంబాబు.

అవమానకరమైన ప్రశ్న అడిగిన జర్నలిస్ట్.. విక్రమ్ జవాబు వింటే వావ్ అనాల్సిందే!