డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 11 మందికి జరిమానా

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు లో పట్టుబడిన వారిలో వేములవాడ కోర్టు లో హాజరుపర్చగా జడ్జి 11 మందికి ఒక రోజు జైలు శిక్ష, 500/- రూపాయల జరిమానా విధించారు.

ఈ సందర్భంగా వేములవాడ రూరల్ ఎస్ ఐ మారుతీ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపకూడదు అని, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల మీకు, ఎదురుగ వున్నవారికి ప్రమాదం అని, ఏదైనా ప్రమాదం జరిగితే మీకు మీ కుటుంబం కి తీరని లోటు అని, హెల్మెట్ కచ్చితంగా ధరించాలని ట్రాఫిక్ రూల్స్ పాటించి వారి గమ్యాస్థానానికి సురక్షితంగా చేరాలని అన్నారు.

ట్రాఫిక్ నియమాలు పాటించని వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటాం అని ఎస్ ఐ మారుతీ తెలిపారు.

జూకీపర్‌పై మగసింహం అటాక్.. ఆడ సింహం ఎలా ఆపిందో చూడండి..