ద్విచక్ర వాహన చోరీ కేసులో ఇద్దరు నిందితులకు 10 నెలల జైలు శిక్ష..

ప్రాసిక్యూషన్ కథనం మేరకు.16 జనవరి 2023 న సిరిసిల్ల కొత్త బస్టాండ్ వద్ద పార్క్ చేసిన ద్విచక్ర వాహనం దొంగతనం జరిగిందని అల్లే నాగరాజు సిరిసిల్ల పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసాడు.

ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ద్విచక్ర వాహనం దొంగిలించిన నిజామాబాద్ జిల్లా బోధన్ కి చెందిన మాలవత్ తులసి రామ్, రాథోడ్ వినోద్ లను అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు.

విచారణ అనంతరం విచారణ అధికారి ఎస్.ఐ తిరుపతి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసారు.

సి ఎమ్ ఎస్ ఎస్.ఐ లావుడ్య శ్రీకాంత్ ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ నరేష్ సాక్షులను ప్రవేశ పెట్టగా కేసు పూర్వపరాలు పరిశీలించిన మేజిస్ట్రేట్ నిందితుడికి 10 నెలల సాధారణ జైలు శిక్ష విధించారని టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ ఒక ప్రకటనలో తెల్పారు.

బోస్టన్‌: ఈ ముద్దుగుమ్మను ఎవరైనా కిస్ చేయవచ్చట.. కానీ మూడు రూల్స్!