భగవంతుని దర్శనానికి వెళ్లుతు ప్రమాదానికి గురైన భక్తులు.. !

కొందరు చేసుకున్న పుణ్యం ఏంటో అర్ధం కాదు.మరికొందరు చేసుకున్న పాపం ఏంటో అంతు చిక్కదు.

కానీ కొందరి ప్రాణాలు పోతున్న తీరు చూస్తే మాత్రం ఎంతో బాధగా అనిపిస్తుంది.

ఇకపోతే భక్తులతో వెళ్తున్న ట్రక్ అదుపు తప్పి లోయ‌లాంటి ప్రదేశంలో పడిపోయిన ఘటన ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో చోటు చేసుకుంది.

కాగా ఈ ప్రమాదంలో ట్రక్‌లో ప్రయాణిస్తున్న 10 మంది భక్తులు మరణించగా, మరో 30 మంది గాయ పడినట్లుగా సమాచారం.

ఇక వీరంతా లఖ్నా దేవీ ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం ఆగ్రా నుంచి తిరుగు ప్రయాణం అయిన సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నారట పోలీసులు.

ఇక ప్రమాద సమయంలో సుమారుగా 50 మంది వరకు భక్తులు ట్రక్‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది.

కాగా మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదని, కానీ వీరంతా పినహట గ్రామానికి చెందిన భక్తులుగా తేలిందని పోలీసులు అందించిన సమాచారం.

పానీపూరీ లవర్స్‌కి గుడ్‌న్యూస్.. జస్ట్ ఇంత పే చేస్తే లైఫ్‌లాంగ్ పానీపూరీ ఫ్రీ.. ఎక్కడంటే?