వేరు కాపురం పెట్టించినందుకు మామను అల్లుడు ఏం చేశాడో తెలుసా?

ఉత్తరాఖండ్‌కు చెందిన ఇక్రమ్‌ అనే వ్యక్తికి ఇటీవలే రక్షరుక్‌ అనే అమ్మాయితో వివాహం అయ్యింది.

ఇక్రమ్‌ది ఉమ్మడి కుటుంబం.ఇంట్లో చాలా మంది ఉంటారు.

వారందరితో తన కూతురు సుఖంగా ఉండదేమో అని భావించిన రక్షరుక్‌ తండ్రి వేరు కాపురం ప్లాన్‌ చేశాడు.

ఇక్రమ్‌కు ఇష్టం లేకపోయినా కూడా వారి కుటుంబ సభ్యులను ఒప్పించి, గొడవ పడి మరీ వేరు కాపురం పెట్టించాడు.

వేరు కాపురం పెడితేనే తాను అన్న కట్నం ఇస్తాను అనడంతో పాటు, తన కూతురును కాపురంకు పంపిస్తానంటూ భీష్మించాడు.

అతడి డిమాండ్‌కు ఇక్రమ్‌ తల్లిదండ్రులు మరియు ఇతర కుటుంబ సభ్యులు ఓకే చెప్పారు.

ఇక్రమ్‌ మరియు రక్షరుక్‌ ఇటీవలే వేరు కాపురం పెట్టారు.వేరు కాపురం పెట్టిన తర్వాత కూడా ఇక్రమ్‌కు అస్సలు ఇష్టం లేదు.

కాని కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు భార్యతో కలిసి వేరే ఉంటున్నాడు.అయినా అప్పుడప్పుడు వెళ్తూనే ఉన్నాడు.

తన కుటుంబ సభ్యులతో రక్షరుక్‌ తండ్రి తనను వేరు చేశాడని ఆగ్రహంతో రగిలి పోయాడు.

అందుకు సరైన సమయంలో కక్ష సాధించాల్సిందేనని ఇక్రమ్‌ అనుకున్నాడు. """/"/ వేరు కాపురం పెట్టాం, వింధు ఇస్తానంటూ మామను ఆయన కుటుంబ సభ్యులను ఇక్రమ్‌ ఇంటికి పిలిచాడు.

ఇక్రమ్‌ విందు కబురు విన్న రక్షరుక్‌ తండ్రి మరియు ఇతర కుటుంబ సభ్యులు సంతోషంగా వచ్చారు.

కూతురు కొత్త సంసారం చూసి వారు చాలా ఆనందించారు.ఆ సమయంలోనే తనకు ఇస్తానంటూ ఒప్పుకున్న కట్నం డబ్బులు ఇవ్వాలని, అదే సమయంలో మరి కొంత కూడా ఇవ్వాలని కోరాడు.

అయితే అందుకు మామ ఒప్పుకోలేదు.అప్పటిగే చాలా కోపంగా ఉన్న ఇక్రమ్‌ మామను తుపాకీతో కాల్చి చంపేశాడు.

కేసు నమోదు చేసిన పోలీసులు ఇక్రమ్‌ను అరెస్ట్‌ చేశారు.క్షణికావేశంలో చేసిన పనికి ఇక్రమ్‌ దారుణమైన ఫలితాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఆయన సింగిల్ అయితే ఓకే.. ఆ స్టార్ సింగర్ క్రష్ అంటున్న సుప్రీత!