మరి కాసేపటిలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధం అయింది.కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

తరువాత అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక జరగనుంది.మరి కాసేపటిలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.

కాగా ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఎన్నిక కాగా స్పీకర్ గా గడ్డం ప్రసాద్ ను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో మొత్తం 119 మంది ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణస్వీకారం చేయించనున్నారు.

అయితే వీరిలో అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు 51 మంది ఉన్నారు.మరోవైపు ఈ సెషన్స్ కు బీజేపీ అభ్యర్థులు దూరంగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఉంటే తాను ప్రమాణస్వీకారం చేయబోనంటూ ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

బాలయ్య పాదాలకు నమస్కరించి అవార్డు అందుకున్న ఐశ్వర్యరాయ్.. ఫ్యాన్స్ ఫిదా!