బాలుడి సాహసం.. తల్లి ప్రియుడికి బుద్ధి చెప్పాలని ఎంతపని చేశాడు.. ?
TeluguStop.com
తన తల్లితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఓ వ్యక్తికి తగిన బుద్ధి చెప్పలని ఓ కుర్రాడు వేసిన ప్లాన్ బెడిసికొట్టగా చివరికి పోలీసుల చేతికి చిక్కాడు.
ఆనందంగా జీవితాని గడపవలసిన వయస్సులో ఇలాంటి పని చేయడం చెడిపోయిన నేటి సమాజానికి నిదర్శనం.
ఇక ఆ వివరాలు చూస్తే.మహారాష్ట్రలోని నాగ్పూర్కి చెందిన చెందిన 15 ఏళ్ల బాలుడు మరో ఇద్దరు స్నేహితుల సాయంతో తన తల్లి ప్రియుడిని అపహరించి బైక్పై తీసుకెళ్లేలా ప్రణాళిక రచించి దాన్ని అమలుచేసే క్రమంలో ఆ కుర్రవాడి స్నేహితులతో కలసి తల్లి ప్రియుడైన నందన్వర్ ను కిడ్నాప్ చేశాడు.
అదే సమయంలో వారికి పోలీస్ పెట్రోలింగ్ వాహనం కనపడటంతో ఇదే అదనుగా భావించిన నందన్వర్ రన్నింగ్ బైక్ నుంచి దూకేసి పారిపోయాడు.
నేరుగా ఈ విషయాన్ని ఆ బాలుడి తల్లికి చేరవేసి, పనిలో పనిగా పోలీసులకు కూడా ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారించారు.
ఆ విచారణలో చేసిన నేరాన్ని అంగీకరించారు.ఇక వీరంతా మైనర్ బాలురు కావడంతో అందులో వీరిపై ఇదివరకు ఎలాంటి క్రిమినల్ రికార్డ్ కూడా లేదు అయినప్పటికీ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు పేర్కొంటున్నారు.
ఎన్టీఆర్ చేసిన ఈ సహాయాల గురించి ఏ మీడియాకు తెలియదు ?