బందరు పోర్టు పనులపై నవయుగకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ

బందరు పోర్టు పనులపై నవయుగకు ఏపీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది.ప్రాజెక్టు పనులు వేరే వారికి ఇవ్వకుండా స్టే ఇవ్వాలని దాఖలైన అనుబంధ పిటిషన్ న్యాయస్థానం కొట్టి వేసింది.

గతంలో నవయుగకి టెండర్లు రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను నవయుగ సవాల్ చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో సింగిల్ బెంచ్ ఆదేశాలపై నవయుగ డివిజన్ బెంచ్ కు వెళ్ళింది.

నవయుగ సంస్థ ఒప్పంద ఉల్లంఘనలకు పాల్పడినట్లు హైకోర్టు డివిజన్ బెంచ్ అభిప్రాయం వ్యక్తం చేసింది.

అనంతరం ప్రధాన పిటిషన్ విచారణను డిసెంబర్ కు వాయిదా వేసింది.

భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిపై భూకబ్జా కేసు నమోదు..!