ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసులో నిందితుడుగా ఉన్న వ్యాపార వేత్త అమిత్ అరోరాకు కస్టడీ పొడిగించాలని ఈడీ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ఈ పిటిషన్ పై విచారణ చేసిన రౌస్ అవెన్యూ కోర్టు అమిత్ అరోరాకు ఈడీ కస్టడీని పొడిగించింది.

ఈ మేరకు మరో వారం రోజులపాటు కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.

అనంతరం తదుపరి విచారణను ఈనెల 13కు వాయిదా వేసింది.

పక్కాగా ప్లాన్ చేసుకుంటున్న బిజెపి.. సిద్దిపేటలో అమిత్ షా బహిరంగ సభ