డ్రైవర్ కి గుండెపోటుతో ట్రాక్టర్ బోల్తా, ముగ్గురు దుర్మరణం
TeluguStop.com
యాదాద్రి జిల్లా:జిల్లాలోని సంస్థాన్ నారాయణపురం మండలం శేరిగూడెంలో విషాదం చోటుచేసుకుంది.ఇటుకలను సరఫరా చేసే ట్రాక్టర్ దిగుమతి చేసి వస్తుండగా ట్రాక్టర్ డ్రైవర్కు అకస్మాత్తుగా గుండె పోటు రావడంతో ట్రాక్టర్ అదుపుతప్పి పల్టీ కొట్టింది.
ఈ ప్రమాదంలో డ్రైవర్తో పాటు ఇంజిన్పై కూర్చున్న మరో ఇద్దరు కూలీలు మృతి చెందగా,మరో ముగ్గురికి గాయాలయ్యాయి.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం,
మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
అఖిల్ లెనిన్ లో గెస్ట్ అప్పిరియన్స్ ఇస్తున్న నాగార్జున.. క్యారెక్టర్ ఏంటంటే..?