గంజాయి నిందితుడిపై పీడీ యాక్ట్ అమలు

అక్రమార్జనకు అలవాటుపడి గంజాయి సరఫరా చేస్తున్న నిందితుడు గొల్ల భాను ప్రసాద్ పై పీడీయాక్ట్ అమలు చేసినట్లు పోలీస్ కమీషనర్ విష్ణు యస్.

వారియర్ తెలిపారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం, సారపాక గ్రామానికి చెందిన నిందుతుడు భాను ప్రసాద్ గత ఏడాది ఏప్రియల్ నెలలో ఖమ్మం రూరల్ సర్కిల్‌లోని రఘునాధపాలెం పోలీస్ స్టేషన్‌ పరిధిలో ముప్పై లక్షల విలువ గల 194 కేజీల గంజాయి రవాణా చేస్తూ.

పట్టుబడ్డ నిందుతులలో భాను ప్రసాద్ వున్నట్లు తెలిపారు.ఈ కేసులో మరో నిందుతుడు బొజ్జ వంశీపై ఇప్పటికే పీడీ యాక్ట్ ఆమలు చేసి సెంట్రల్ జైలుకు తరలించినట్లు తెలిపారు.

అదేవిధంగా 2020 సంవత్సరంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు గంజాయి కేసుల్లో భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు భాను ప్రసాద్ అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

గంజాయి వంటి మాదక ద్రవ్యాలను కట్టడి చేయకుంటే భవిష్యత్తులో సమాజంపై తీవ్రమైన దుష్ప్రభావం చూపే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఇలాంటి వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే క్రిమినల్స్ పై కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు.

ఖమ్మం రూరల్ సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిందుతులను చెంచల్ గూడ సెంట్రల్ జైల్, హైదరాబాదు కు తరలించి సంబంధిత పత్రాలు జైలు అధికారులకు అప్పగించినట్లు తెలిపారు.

కాజల్ నటించిన ఆ రెండు ఫ్లాప్ సినిమాలంటే అంత ఇష్టమా?