కేసీఆర్ యాదాద్రి పర్యటన రద్దు
TeluguStop.com
యాదాద్రి జిల్లా:నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి పర్యటన రద్దయింది.యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం 11 గంటలకు బాలాలయంలో జరిగే తిరుకల్యాణ మహోత్సవంలో సీఎం కేసీఆర్ పాల్గొనాల్సి ఉండగా ప్రస్తుతం ఆయన పర్యటన రద్దు అయినట్లు అధికారులు తెలిపారు.
కేసీఆర్ కి స్వల్ప అనారోగ్యం కారణంగానే ఈ పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో యాదాద్రి తిరుకళ్యాణ మహోత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానం తరపున శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలను బాలాలయంలో సమర్పించారు.
ఈ కార్యక్రమంలో ఈవో గీతారెడ్డి,తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈవో రమేష్ బాబు,చైర్మన్ సతీమణి,తిరుమల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఒకే దారిలో నడుస్తున్న అల్లు అర్జున్, ఎన్టీఆర్.. ఇద్దరు హీరోలకు సక్సెస్ దక్కుతుందా?