కాంగ్రెస్ గూటికి యువజన సంఘాల అధ్యక్షులు ఉప్పల అమరేందర్

ఇల్లంతకుంట వార్డుసభ్యులు, యువకులు,కులసంఘాల నాయకుల చేరిక.కండువా కప్పి ఆహ్వానించిన డాక్టర్ డాక్టర్ కవ్వంపెల్లి సత్యనారాయణ.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట( Ellantakunta ) మండల కేంద్రంలోని వార్డు సభ్యులు, యువజన సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు పెద్ద ఎత్తున సోమవారం కాంగ్రెస్ పార్టీ( Congress Party )లో నియోజకవర్గం అభ్యర్థి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ( Kavvampalli Satyanarayana ) సమక్షంలో చేరారు.

రోజురోజుకు కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ప్రజా ఆధారణ చూసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు.

మానకొండూరు నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ గెలిపించేందుకు కృషి చేస్తామని వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట ఎంపీపీ వుట్కూరివెంకట రమణారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు భూంపెల్లి రాఘవరెడ్డి, మాజీ ఎంపీపీ గుడిసె ఐలయ్య యాదవ్, టిపిసిసి రాష్ట్ర కిసాన్ సెల్ ప్రధాన కార్యదర్శి రాజేందర్ రెడ్డి,యువజన కాంగ్రెస్ మానకొండూర్ నియోజకవర్గ అధ్యక్షులు అంతగిరి వినయ్ కుమార్,చిట్టి ఆనందరెడ్డి, అంతగిరి బాలపోచయ్య, జమాల్, మామిడి నరేష్, పలువురు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

పార్టీలో చేరీన వారిలో సభ్యులు చిట్టి ప్రదీప్ రెడ్డి, గడ్డం రమరవీందర్ రెడ్డి, ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు గొడుగు నర్సయ్య, సీనియర్ నాయకుడు ఈదుల రాజీరెడ్డి, కాసుపాక శంకర్, నాగపురి రవి, శేని శ్రీనివాస్, కాసుపాక సురేష్, మామిడి మల్లికార్జున్ తదితరులు ఉన్నారు.

ఇండియాలో సేఫ్ లొకేషన్ ఏది.. యూఎస్ యువతి అడిగిన దానికి ఆన్సర్లు ఇవే..?