ఏలూరు జిల్లాలో దారుణం.. నిద్రిస్తున్న కుటుంబంపై కత్తులతో దాడి

ఏలూరు జిల్లాలో దారుణం జరిగింది.జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెంలో నిద్రిస్తున్న కుటుంబంపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు.

ఈ దాడిలో భార్యాభర్తలతో పాటు కుమారుడికి తీవ్ర గాయాలు అయ్యాయి.గమనించిన స్థానికులు బాధితులను హుటాహుటిన ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

అయితే గాయపడిన కుటుంబం కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తుంటారని స్థానికులు చెబుతున్నారు.

ఘటనపై కేసు నమోదు చేసిన జంగారెడ్డిగూడెం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

యూకే : సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం.. ఉనికి కోసం కన్జర్వేటివ్‌లు పోరాడాల్సిందేనా..?