కొన్ని సీరియల్స్ లో హీరోయిన్స్ కన్నీళ్లు పెట్టించి మరి మనసులో ఉండిపోతారు.అలా తన సహజ నటనతో కన్నీళ్లు పెట్టించి మరి ప్రేక్షకుల మనసు దోచిన నటి మౌనరాగం హీరోయిన్ ప్రియాంక.
బుల్లితెరపై అందంగా.నిజంగా ముగా అమ్మాయి ఏమో అని అనుకునేలా సహజంగా నటించే ముద్దు గుమ్మా ప్రియాంక తను సీరియల్స్ లోకి ఎలా వచ్చింది అనేది చెప్పుకొచ్చింది.
ఆమె ఓ ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు.”ఆమె స్వస్థలం ముంబై అని.కొద్ది కాలానికి బెంగుళూరులో స్థిరపడ్డారు అని.అయితే ఆమెకు ముంబైలో ఉన్నప్పుడే యాడ్స్ నటించే అవకాశం వచ్చింది అని.అయితే అందులో చెయ్యలేదు.ఆతర్వాత బెంగుళూరుకు వచ్చాక కన్నడ సినిమా గోలీమార్ లో నటించే అవకాశం వచ్చింది అని.
అందులో నటించినట్టు చెప్పిన ప్రియాంక జైన్.ఆ తరువాత తెలుగులో ”చల్తే చల్తే” అనే సినిమాలో అవకాశం రావడంతో అందులోనూ నటించినట్టు ఆమె చెప్పింది.
అయితే అలా సినిమా చేసే సమయంలోనే ఆమెకు ”మౌనరాగం” సీరియల్లో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది అని.ఆ సీరియల్ తో ఆమెకు మంచి గుర్తింపు వచ్చినందుకు ఎంతో ఆనందంగా” ఉన్నట్టు ఆమె చెప్పుకొచ్చారు.
.