తెలుగులో ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ లైవ్ “జీ తెలుగులో ప్రసారమయ్యే “ముద్ద మందారం” అనే సీరియల్ లో నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి “నీలాంబరి” పాత్రలో నటించి బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ప్రముఖ సీరియల్ ఆర్టిస్ట్ “సునంద” గురించి బుల్లితెర ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే సునంద గతంలో జెమినీ టీవీ మరియు ఈటీవీలో ప్రసారమయ్యే పలు ధారావాహికలో కూడా నటించి బాగానే ఆకట్టుకుంది.
కాగా తాజాగా సునంద ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని తన సినీ ప్రస్థానం గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
అయితే ఇందులో భాగంగా చిన్నప్పుడే తన తండ్రిని కోల్పోయానని దాంతో తన కన్నతల్లి కష్టపడి తనని పెంచిందని తెలిపింది.
ఆ తర్వాత కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో తన తల్లిని కూడా కోల్పోయానని, దీంతో చిన్న వయసములోనే పెను విషాదాలని ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది.అంతేగాక తానెప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచించలేదని అందువల్లనే పెద్దగా డబ్బు కూడా సంపాదించుకో లేదని కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను చూస్తుంటే భవిష్యత్తు ప్రణాళికలు ఎంతో ముఖ్యమని అనిపిస్తుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
అయితే తాను ముద్ద మందారం ధారావాహికలో నెగటివ్ షేడ్స్ ఉన్నటువంటి పాత్రలో నటించడంతో అందరూ తన స్వభావం కూడా అలాగే ఉంటుందని అనుకుంటున్నారని కానీ నిజ జీవితంలో తాను చాలా సున్నితంగా ఉంటానని చెప్పుకొచ్చింది.
అలాగే జీ ఎంటర్టైన్మెంట్ తనకి ఫ్యామిలీతో సమానమని, అందువల్లనే వరుస ధారావాహికలలో నటిస్తున్నానని చెప్పుకొచ్చింది.
కాగా ప్రస్తుతం సునంద జీ తెలుగులో ప్రసారమయ్యే “హిట్లర్ గారి పెళ్ళాం” అనే ధారావాహికలో నటిస్తుంది.