ఇక్కడ తెలుగు వాళ్ళకంటే వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందంటున్న సీరియల్ నటి...

తెలుగులో ప్రముఖ సీనియర్ నటుడు శ్రీకాంత్ హీరోగా నటించిన “మల్లిగాడు – మ్యారేజ్ బ్యూరో” చిత్రంలో హీరో చెల్లెలి పాత్రలో నటించి సినీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్న సీరియల్ హీరోయిన్ “శిరీష” గురించి సినిమా ప్రేక్షకులకి మరియు బుల్లితెర ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ అమ్మడు మొదటగా తెలుగులో “మనసు మమత” అనే ధారావాహికలో నటించి బాగా పాపులర్ అయింది.

 Telugu Serial Actress Sireesha Serious Comments On Telugu Artist Encouragement I-TeluguStop.com

అయితే ఆ మధ్య పెళ్లయి ఓ బిడ్డకు జన్మనివ్వడంతో ప్రస్తుతం కుటుంబ బాధ్యతలను చక్కబెడుతూ సినిమాలు లేదా ధారావాహికలపై పెద్దగా దృష్టి సారించ లేకపోతోంది.అయితే తాజాగా శిరీష ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని సినిమా పరిశ్రమలో తెలుగు నటీనటుల అవకాశాలపై పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.

అయితే ఇందులో భాగంగా ఈ మధ్య కాలంలో కొందరు దర్శక నిర్మాతలు కన్నడ భాషకు చెందిన నటీనటులను ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారని తెలుగు నటీనటులకు అవకాశాలు పెద్దగా ఇవ్వడం లేదని సంచలన వ్యాఖ్యలు చేసింది.అంతేగాక ప్రతిభ లేనటువంటి నటీనటులను కన్నడ సినీ పరిశ్రమ నుంచి తీసుకువచ్చి వారికి పారితోషికం ఎక్కువ మొత్తంలో ఇస్తున్నారని చెప్పుకొచ్చింది.

అంతేగాక వారికి వేలకు వేలు ఖర్చు పెట్టి వసతి సదుపాయాలు మరియు విమానం టికెట్లు కూడా కల్పిస్తున్నారని కానీ తెలుగు నటీనటులకి మాత్రం సరిగ్గా పారితోషికం ఇవ్వాలంటే కొందరు దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారని ఇది సరికాదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

Telugu Sireesha, Maa, Telugu, Teluguserial, Tollywood-Movie

అలాగే కన్నడ నటీనటులను తెలుగు సినీ పరిశ్రమలో మనం ప్రోత్సహించినంతగా కన్నడ సినిమా పరిశ్రమలో తెలుగు నటీనటులను ప్రోత్సహించరని అంతగా వారు తమ అవకాశాలను రక్షించు కుంటున్నారని కానీ తెలుగు సినిమా పరిశ్రమలో మాత్రం ఇందుకు భిన్నంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది.నటన పరంగా చూసినా సరే తెలుగు వాళ్ళు తమ పాత్రకు దగ్గటుగా హావభావాలు పండించినట్లుగా ఇతర భాషా నటీనటులు న్యాయం చేయలేరని అలాంటప్పుడు ఇతర భాషా నటీనటులకు ఎందుకంత ప్రాధాన్యత ఇస్తున్నారో తనకి ఇప్పటికీ అర్థం కావడం లేదని తన సందేహాన్ని వ్యక్తం చేసింది.

అలాగే తాను గతంలో తాను తమిళ భాషలో కూడా 1, 2 ధారావాహికలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించానని, కానీ ఇప్పటి వరకు కన్నడ సినిమా పరిశ్రమ నుంచి తనకు ఎలాంటి ఆఫర్లు రాలేదని తెలిపింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం శిరీష తెలుగులో ప్రముఖ ఎంటర్ టైం మెంట్ ఛానెల్ అయిన స్టార్ మా లో ప్రసారం అవుతున్న “చెల్లెలి కాపురం” అనే ధారావాహికలో లీడ్ పాత్రలో నటిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube