తెలుగు బుల్లి తెరపై టీవీ ఛానల్ తో సంబంధం లేకుండా డా దాదాపుగా జెమిని, జీ తెలుగు, ఈ టీవీ, ఇలా అన్ని చానళ్లను కవర్ చేస్తూ తన సీరియళ్లతో సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న “టాలీవుడ్ యంగ్ సీరియల్ హీరో రవి కృష్ణ” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే రవి కృష్ణ 2019వ సంవత్సరంలో “బిగ్ బాస్ మూడవ సీజన్” లో కంటెస్టెంట్ గా పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
అంతే కాక పలు సీరియళ్లలో కూడా నటించే అవకాశాలను దక్కించుకొని ప్రస్తుతం బుల్లి తెర పై బాగానే రాణిస్తున్నాడు. కాగా తాజాగా రవి కృష్ణ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని తన సినీ కెరీర్ గురించి పలు ఆసక్తికర అంశాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.
అయితే ఇందులో భాగంగా తాను మొదటగా టాలీవుడ్ ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయిన ఈ టీవీలో ప్రసారమయ్యే “హృదయం” అనే ధారావాహిక ద్వారా బుల్లి తెరకు నటుడిగా పరిచయమయ్యానని ఆ తర్వాత వరుసగా సీరియల్లలో నటించే అవకాశాలు రావడంతో బుల్లితెరకు పరిమితమయ్యారని చెప్పుకొచ్చాడు.ఈ క్రమంలో దాదాపుగా 8కి పైగా సీరియళ్ళలో నటించానని చెప్పుకొచ్చాడు.
అయితే ఆ మధ్య జీ తెలుగులో ప్రసారమయ్యే “వరూధిని పరిణయం” ధారావాహిక తనకు ఎంతగానో గుర్తింపు తెచ్చిందని ఆ సీరియల్ తన సినీ కెరీర్లో మంచి మైలు రాయిగా నిలిచిపోయిందని తెలిపాడు.
అయితే ఆ సీరియల్ లో హీరోయిన్ గా నటించిన చందన శెట్టి మొదట్లో తనతో బాగానే ఉండేదని కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో గాని ఇద్దరి మధ్య బాగా దూరం పెరిగిందని తెలిపాడు.
అయితే ఇందుకు ముఖ్య కారణంగా చందన శెట్టి పలు సీరియళ్లలో నటిస్తూ బిజీ అవడమని, అంతేగాక స్టార్ డమ్ వచ్చిన తరువాత ఇద్దరి మధ్య కొంతమేర బాగా దూరం పెరగడంతో ప్రస్తుతం పలకరింపులు కూడా పెద్దగా లేవని తెలిపాడు.ఒక రకంగా చెప్పాలంటే స్టార్ డం, ఈగో తదితర కారణాల వల్లే చందన శెట్టికి దూరంగా ఉంటున్నానని పరోక్షంగా రవి క్రిష్ణ కామెంట్ చేశాడు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రవి కృష్ణ ప్రముఖ తెలుగు ఎంటర్టైన్మెంట్ చానల్ అయినటువంటి మా టీవీలో ప్రసారమయ్యే “ఆమె కథ” అనే ధారావాహిక లో హీరోగా నటిస్తున్నాడు.ఈ ధారావాహిక మధ్యాహ్నం 12 గంటల సమయంలో ప్రసారమవుతుంది.
అంతేగాక పలు షోలు ఈవెంట్ లలో కూడా పాల్గొంటూ ప్రస్తుతం రవి కృష్ణ బాగానే సంపాదిస్తున్నాడు.