తెలుగులో ఒకప్పుడు హీరోగా రాణించి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న “టాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటుడు నరేష్” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే నటుడు నరేష్ ప్రముఖ స్వర్గీయ నటి విజయ నిర్మల కొడుకు అయినప్పటికీ సినిమాల్లోకి వచ్చిన తర్వాత కష్టపడి సినిమా అవకాశాలను దక్కించుకున్నాడు.
అంతేగాక అప్పట్లో తన కామెడీ చిత్రాలతో ప్రేక్షకులను బాగానే అలరించాడు.కాగా తాజాగా నరేష్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని తన జీవితంలో ఎదుర్కున్న ఒడిదుడుకులను గురించి ప్రేక్షకులతో పంచుకున్నాడు. అయితే ఇందులో భాగంగా తాను సినిమాలకు కొంత కాలం పాటు దూరం అయిన తర్వాత పలు వ్యాపారాలు చేశారని, కానీ ఈ వ్యాపారాల్లో తీరని నష్టాలను చవి చూశానని తెలిపాడు.ఈ క్రమమంలో తన పెద్దల నుంచి సంక్రమించిన ఆస్తులను కూడా అమ్ముకున్నానని, ఆ తర్వాత తానూ ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశ్యంతో రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ తన స్వప్రయోజనం కోసం డబ్బును సంపాదించుకోలేదని తెలిపాడు.
ఆ తర్వాత దాదాపుగా మూడు నాలుగేళ్ల పాటు కష్టపడి పని చేసి వ్యాపారాల్లో పోగొట్టుకున్న డబ్బును తిరిగి సంపాదించుకున్నానని చెప్పుకొచ్చాడు.
అంతేగాక తాను డబ్బు నష్టపోయినందుకు ఎప్పుడూ బాధ పడలేదని కేవలం నష్టపోయిన డబ్బుని తిరిగి రాబట్టేందుకు మాత్రమే ప్రయత్నించి విజయం సాధించానని తెలిపాడు. ఇక తన సినీ కెరీర్ విషయానికొస్తే తనకు హీరోగా అవకాశాలు తగ్గిపోయిన తర్వాత ఎలాంటి పాత్రలో అయినా సరే నటించేందుకు సిద్ధమయ్యానని అందువల్లనే ఇప్పటికీ సినిమా పరిశ్రమలోనటుడిగా కొనసాగుతున్నానని చెప్పుకొచ్చాడు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నరేష్ పలు చిత్రాలలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తున్నాడు.
కాగా తాజాగా టాలీవుడ్ యంగ్ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న “రంగ్ దే” అనే చిత్రంలో హీరో నితిన్ తండ్రి పాత్రలో నటిస్తున్నాడు.ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు దుబాయిలో జరుగుతున్నట్లు సమాచారం.
కాగా నటుడు నరేష్ కొడుకు నవీన్ విజయ్ కృష్ణ కూడా తెలుగులో పలు చిత్రాల్లో హీరోగా నటించాడు. కానీ తన తండ్రి మాదిరిగా నవీన్ విజయ్ కృష్ణ ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతున్నాడు.