తెలుగు నేలని విడిచి సుదూర్ఘతీరాలకి వలస వెళ్ళిన తెలుగువారు ఎక్కడా ఉన్నా సరే తెలుగుదనం యొక్క గొప్పదనాన్ని చాటి చెప్పకుండా మానరు.తాము ఉన్నది పాశ్చాత్య సంస్కృతిలో అయినా సరే తమ తెలుగుకి వెలుగుని పంచడంలో ఎప్పుడూ ముందుంటూనే ఉంటారు.
స్థానికంగా ఉండే తెలుగు వారందరూ ఒక సంస్థగా ఏర్పడి తెలుగు సంస్కృతిని చాటి చెప్పే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
ఈ కోవలోనే ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం మాతృ బాషని అభిమానించండి, తెలుగు సాహిత్యాన్ని ఆస్వాదించండి అనే శీర్షికతో తెలుగు సాహిత్య వేదిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.
ఎప్పటి నుంచో తెలుగు సాహిత్య అభివృద్ధి కోసం పాటు పడుతూ ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేసిన ఈ సంఘం 146 వ నెల నెలా తెలుగు వెన్నెల మరియు 43 వ టెక్సాస్ తెలుగు సాహిత్య సదస్సు ఏర్పాటు చేసి సాహితీ బంధువులు అందరికి ఆహ్వానం పలికింది.
శనివారం అంటే సెప్టెంబర్ 28 వ తేదీన మధ్యాహ్నం 11 గంటల నుంచీ సాయంత్రం 4-30 వరకూ ఈ వేడుకలు నివార్వహించనున్నారు.ఈ కార్యక్రమంలో స్వాగత పరిచయాలు అయిన తరువాత తెలుగు భోజనం ఆ తరువాత సాహిత్య సమాహారం, ప్రత్యేక తెనేటి విందు ,స్వీయ రచనలు, వ్యాసాలూ, పిల్లలకి చెందిన పలు కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.మరిన్ని వివరాలకోసం సంస్థ ప్రచురించిన పోస్టర్ ని పరిశీలించగలరు.