అమెరికాలో చిత్తూరు వాసి మృతి...!!!

అమెరికాలో తెలుగు ఎన్నారై మరణించిన ఘటన ఆయన స్వగ్రామంలో విషాదం నింపింది.ఎన్నో ఆశలతో అమెరికాలో ఉన్నత చదువులు చదవాలని, మంచి ఉద్యోగం చేయాలని కలలు కన్నా అతడి ఆశలని మృత్యువు కబళించింది.

 Telugu Nridiedin Usby Roadaccident 1-TeluguStop.com

ఎంతో సరదాగా అందరితో కలిసి మెలిసి ఉండే అతడు లేదనే విషయం తల్లి తండ్రులకి, స్నేహితులకి, కుటుంభ సభ్యులకి తీరని శోకాన్ని మిగిల్చింది.వివరాలలోకి వెళ్తే.

చిత్తూరు జిల్లా మిరియం గంగానపల్లికి చెందిన వివేక్ అనే వ్యక్తి అమెరికాకి ఉన్నత చదువుల కోసం వెళ్ళాడు.నార్త్ కరోలిన యూనివర్సిటీ లో ఎంటెక్ చేస్తున్న వివేక్.

తన పార్ట్ టైం ఉద్యోగాన్ని ముగించుకుని ఇంతకి తిరిగి వెళ్తున్న సమయంలో ఒక్క సారిగా గుర్తు తెలియని వాహనం డీ కొట్టడంతో అతడు అక్కడికక్కడే మరణించాడు.ఈ సమాచారం అందుకున్న స్నేహితులు వెంటనే ఘటన స్థలానికి వెళ్లి కన్నీరు మున్నీరుగా విలపించారు.

వివేక్ మృతి సంచారాన్ని అతడి తల్లి తండ్రులకి తెలిపారు.దాంతో వారి కుటుంభంలో విషాదచాయలు అలముకున్నాయి.

త్వరలో వివేక్ మృతదేహం సొంత ఊరు గంగానపల్లి కి వెళ్ళే ఏర్పాట్లు చేస్తున్నారు స్నేహితులు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమదానికి గల కారణాలని పరిశీలిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube