అమెరికాలో కొన్నేళ్లుగా ఉంటూ అక్కడి ఫెడరల్ సంస్థలో డైరక్టర్ గా పనిచేస్తున్న తెలుగు ఎన్నారై ప్రవీణ్ తుమ్మల పల్లి గుండె పోటుతో మరణించారు.వర్జీనియా రాష్ట్రం వాషింగ్టన్ డీసీ మెట్రో ప్రాంతంలోని అల్దీ నగరంలో నివసిస్తున్న ఆయన ఈ నెల 22న గుండెల్లో నెప్పి వస్తుందంటూ ఒక్కసారిగా కుప్ప కూలిపోయారని ఆసుపత్రికి తీసుకుని వెళ్లేలోగానే మరణించారని తెలుస్తోంది.
నల్గొండ జిల్లా పేర్వాల్ గ్రామానికి చెందిన ప్రవీణ్ వయస్సు 45 ఏళ్లు.ఆయనకు భార్య పావని, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.ఆయన మృతి పట్ల అమెరికాలో పలు తెలుగు సంఘాలు సైతం సంతాపం ప్రకటించాయి.ఆయన మృతి ఇక్కడి తెలుగువారికి తీరని లోటు ఆయన మిత్రులు వాపోతున్నారు.
నల్గొండలోనే ప్రవీణ్ తల్లి తండ్రులు, భంధువులు ఉన్నందున స్వదేశానికి ఆయన భౌతిక కాయాన్ని తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.రేపటి రోజున అంటే బుధవారం వర్జీనియాలోని తెలుగు వారు ప్రవీణ్ కి నివాళులు అర్పించానున్నారని తెలుస్తోంది.