అమెరికాలోని టెక్సాస్ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచీ దిగువ సభకి సభ్యుడిగా డెమోక్రటిక్ పార్టీ తరుపునుంచీ తెలంగాణా కి చెందిన ఎన్నారై పోటీ పడటం ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది.ఆ తెలుగు ఎన్నారై పేరు శ్రీనివాస్ కులకర్ణి.
హైదరాబాద్ లో ఎన్నారై కుటుంభ సభ్యులని కలుసుకుని తనకి మద్దతు ఇవ్వాల్సిందిగా ఆయన కోరారు.ముంబై , చెన్నై, బెంగుళూర్, తిరుపతి లాంటి నగరాలలో ప్రచారం చేస్తూ తనకి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు.
ఈ క్రమంలోనే శ్రీనివాస్ శంషాబాద్ మండలం ముచ్చింతలలో చినజీయర్ గారిని కలిసి ఆశీర్వాదం అందుకున్నారు.అంతేకాదు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేతీఆర్ ని కలిసిన ఆయన తాను పోటీ చేస్తున్న విషయం వెల్లడించారు.
హైదరబాద్ లోని కొన్ని ప్రాంతాలలో నివాసం ఉంటున్న అమెరికాకి చెందినటువంటి వారి వారి కుటుంభ సభ్యులని కలుసుకుని మద్దతు కూడగట్టుకుంటున్నారు.
అమెరికాలో ప్రవాస భారతీయుల హక్కుల కోసం పోటీ చేస్తున్నానని ఆయన అన్నారు.
ఇదిలాఉంటే హైదాబాద్ నుంచీ అమెరికా వెళ్ళిన వెంకటేశ్ కులకర్ణి అమెరికాలోని లూసియానా లో స్థిరపడ్డారు.ఆయనకీ జన్మించిన వ్యక్తే శ్రీనివాస్ కులకర్ణి.
ఈయన ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచీ మాస్టర్ డిగ్రీ పొందారు.గతంలో కూడా దిగువ సభకి పోటీ చేసిన ఆయన స్వల్ప తేడాతో ఓడిపోవడంతో ఈ సారి తప్పకుండా గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది.