1.భారత టెకిలకు అమెరికా కోర్టు శుభవార్త
కరోనా సమయం ప్రయాణాలపై అంశాలను సాకుగా చూపిస్తూ అమెరికా విదేశాంగ శాఖ ఆదేశాలు జారీ చేస్తే అది చట్ట విరుద్ధం అని అమెరికా న్యాయస్థానం తీర్పు వెలువరించింది.చైనా, ఇరాన్ , భారత్ ,బ్రెజిల్, దక్షిణాఫ్రికా , షెంజెన్ ప్రాంతం , బ్రిటన్ ఐర్లాండ్ సందర్శకుల పై ఎప్పటికీ అమెరికా ఆంక్షలను కొనసాగిస్తోంది.
2.ఏపీ విద్యార్థినికి ‘తానా ‘ లాప్ టాప్ అందజేత
ఏపీ లోని కర్నూలు నగరానికి చెందిన విద్యార్థినికి కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ చైర్మన్ పొట్లూరి రవి సహకారంతో 50 వేల విలువైన ల్యాప్ ట్యాప్ ను అందజేశారు.
3.అమెరికాలో కాల్పులు
అమెరికా లో కాల్పులు కలకలం సృష్టించాయి టెక్సాస్ లోని ఓ స్కూల్ విద్యార్థి జరిపిన కాల్పుల్లో నలుగురు గాయపడగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.తిమోతి జార్జ్ సింప్కిన్స్ (18) అనే విద్యార్థి తనతో పాటు తెచ్చుకున్న తుపాకితో కాల్పులకు తెగబడ్డాడు.
4.తాలిబన్ల ను చర్చలకు ఆహ్వానించిన రష్యా
ఈ నెల 20న మాస్కోలో తాలిబన్లతో చర్చలు జరిపేందుకు రష్యా ఆహ్వానించింది.
5.భారత జాలర్లపై రాళ్లు విసిరిన శ్రీలంక నేవీ
భారత జాలర్లపై రాళ్లు విసిరి వారి వలన శ్రీలంక ధ్వంసం చేసింది.కచ్చాతీవు సమీపంలో ఈ ఘటన జరిగినట్లు తమిళనాడు మత్స్యశాఖ అధికారులు తెలిపారు.
6.చైనా తో అమెరికా యుద్ధం చేయవచ్చు : ట్రంప్
అమెరికా లోని ప్రస్తుత బలహీన , అవినీతి ప్రభుత్వాన్ని చైనా ఏ మాత్రం గౌరవించడం లేదని అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విమర్శించారు. చైనా తో అమెరికా యుద్ధం చేసేలా పరిస్థితి కనిపిస్తోంది అంటూ ట్రంప్ విమర్శించారు.
7.విలువైన కాయిన్ ముద్రించిన అమెరికా
ప్రపంచంలోనే అత్యంత విలువైన నాణాన్ని ముద్రించేందుకు అమెరికా ఏర్పాట్లు చేసుకుంటోంది.
8.వాషింగ్టన్ లో తెలుగు వారి 5 కే రన్
అమెరికా రాజధాని మెట్రో ప్రాంతంలో వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో 5కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వందలాది మంది భారతీయ చిన్నారులు పాల్గొన్నారు.
9.టోక్యో లో భారీ భూకంపం
జపాన్ రాజధాని టోక్యో లో గురువారం భారీ భూకంపం సంభవించింది.టోక్యో కి తూర్పున చిబా ప్రిపెక్చర్ ప్రధాన కేంద్రంగా భూకంపం సంభవించింది.రిక్టర్ స్కేలుపై 6.1 గా తీవ్రత నమోదు అయ్యింది.
10.ప్రీస్కో సిటీ పార్క్ బోర్డ్ మెంబర్ గా వేణు
టెక్సాస్ లోని ప్రిస్కొ సిటీ కి సంబందించిన పార్క్ రిక్రియేషన్ బోర్డ్ సభ్యుడిగా భారతీయుడైన వేణు భాగ్యనగర్ ఎన్నికయ్యారు.ఈయన కరీంనగర్ జిల్లా చేగుర్తి.