1.అమెరికా లో పోస్ట్ ఆఫీస్ కి భారతీయుడి పేరు
అమెరికాలోని హూస్టన్ లో 2019 లో దుండగుల కాల్పులు ప్రాణాలు కోల్పోయిన భారతీయ అమెరికన్ పోలీస్ అధికారి సందీప్ సింగ్ ధలీవాల్ కు తాజాగా అరుదైన గౌరవం దక్కింది.వెస్ట్ హూస్టన్ లోని ఓ పోస్ట్ ఆఫీస్ కు ధలివాల్ పేరు పెట్టారు.
2.ప్రవాసీయులకి శుభవార్త సౌదీ లో కొత్త రూల్
వలసదారులు నియామకాలపై సౌదీ అరేబియా కొత్త రూల్ తీసుకు వచ్చింది.సౌదీ యజమాని ఎవరైనా వ్యక్తిగత ప్రయోజనం కోసం వలస దారుడిని పని చేయడానికి అనుమతి ఇచ్చినట్లయితే మూడు నెలల జైలు, 50 వేల సౌదీ రియాల్స్ జరిమానా ఉంటుంది అని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్ పోర్ట్ స్పష్టం చేసింది.
3.తాలిబన్ల కొత్త రూల్
ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబన్ల ప్రభుత్వం విద్య పై డిక్రీని జారీ చేసింది.దీని ప్రకారం 20 సంవత్సరాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా గ్రాడ్యుయేషన్ చేసిన విద్యార్థుల డిగ్రీలను తాలిబన్ ప్రభుత్వం గుర్తించడం లేదని ప్రకటించింది.
4.ఫోర్బ్స్ జాబితా నుంచి ట్రంప్ అవుట్
ఫోర్స్ విడుదల చేసిన అమెరికాలోని నాలుగు వందల మంది సంపన్నుల జాబితాలో మాజీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరు లేదు.గత 25 ఏళ్లలో ట్రంప్ చోటు కోల్పోవడం ఇదే తొలిసారి.
5.చైనాలోని కరోనా పుట్టుక
చైనా లోని కరోనా వైరస్ పుట్టింది అనేదానికి కొన్ని ఆధారాలు లభించాయి.చైనాలోని వుహన్ లో తొలి కేసు వెలుగులోకి రావడంతో కొన్ని నెలల ముందు నుంచే అక్కడ ల్యాబ్ లు కెసిఆర్ పరీక్ష పరికరాలను భారీగా కొనుగోలు చేసినట్లు తేలింది.
6.కరోనా వైరస్ … డబ్ల్యూహెచ్ఓ వార్నింగ్
Covid 19 ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది.కరోనా ముగిసిపోయిందని కొందరు భావిస్తున్నారని, కానీ ఆ మహమ్మారి నుంచి ఇంకా ప్రపంచం బయటపడలేదని స్పష్టం చేసింది.
7.అణు బాంబుల సంఖ్యను వెల్లడించిన అమెరికా
అమెరికా ప్రభుత్వం తమ వద్ద ఉన్న బాంబులు సంఖ్యను వెల్లడించింది.గత ఏడాది సెప్టెంబర్ 30 నాటికి అమెరికా వద్ద 3,750 అణ్వాయుధాలు ఉన్నట్లు ఆ దేశ సైన్యం తెలిపింది.
8.సోమనాథ్ ఆలయంలో లోని విగ్రహాన్ని ధ్వంసం చేసిన తాలిబన్లు
ఆఫ్గాన్ లోని ప్రసిద్ధ హిందూ దేవాలయమైన సోమ్ నాథ్ ఆలయం లోని విగ్రహాన్ని తాలిబన్లు ధ్వంసం చేశారు.
9.మిజోరాంలో కి భారీగా మయన్మార్ శరణార్థులు
మయన్మార్ నుంచి మిజోరం కు శరణార్థులు భారీస్థాయిలో పోటెత్తుతున్నారు.భారత్ మయన్మార్ సరిహద్దులో ఉన్న చిన్ రాష్ట్రం లోని గ్రామాలపై ఆ దేశ సైన్యం గత కొంత కాలంగా దాడులకు దిగుతున్నారని అంతో స్థానిక ప్రజలు ఊర్లను ఖాళీ చేస్తూ మిజోరంలో కి ప్రవేశిస్తున్నారు.
10.ఐఎస్ఐ చీఫ్ ఆకస్మిక బదిలీ
పాకిస్తాన్ ఆర్మీ అనూహ్య నిర్ణయం తీసుకుంది.పలువురు ఉన్నతాధికారులు బదిలీ చేసింది వీరిలో ప్రస్తుతం ఐఎస్ఐ చీఫ్ గా ఉన్న లెఫ్టినెంట్ జనరల్ ఫయాజ్ హమీద్ కూడా ఉన్నారు.